ఇది నిజం. అభ్యర్థులు గెలుస్తారు. ఆ వెంటనే ఓటర్లు ఓడిపోతారు. ఇది ప్రతి ఎన్నికలకూ జరిగే తంతే. అయితే జీహెచ్ ఎంసీలో ఓటర్లు..ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లు దారుణంగా ఓడిపోబోతున్నారు. తమను హీనంగా ఘోరంగా చూస్తూ...హాని తలపెడుతున్న తెలంగాణ రాష్ర్ట సమితి గెలవాలని వారు కోరుకుంటున్నారు. కారు దూసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. సైకిల్ ఓటేస్తే వారు కారు లిఫ్ట్ అడిగి పోవడం ఖాయం. కమలానికి ఓటేస్తే వాడూ కారు గూటికి చేరడం తప్పదు. ఇలాంటి పరిస్థితిలో టీడీపీ, బీజేపీకి ఓటేసి వగచే కంటే.. కారు గెలవాలని కోరుకోవడంలో తప్పేముంది? నేరుగా హాని తలపెట్టే కేసీఆర్ కంటే.. మేమున్నామని నమ్మించి ద్రోహం చేసే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సీమాంధ్రుల పాలిట ఎంత ప్రమాదకారులో ఎప్పుడో అర్థమైపోయింది.
ఇద్దరు మిత్రుల కుట్ర
తాము ఓటేయాలని ఈవీఎం దగ్గరకు వెళితే..ద్రోహం తలపెట్టేందుకా అన్నట్టు చూస్తున్న గుర్తులను మరీ మరీ గుర్తుంచుకున్నారు. అవే సైకిల్, కమలం.. ఇద్దరూ పొత్తు పొట్టుకున్నారు. ఈ కూటమికి ఓటేద్దామని వెళితే.. ఈ ఇద్దరు గులాబీ గూటికి మిత్రులైపోయారు. మిత్రుల మధ్య స్నేహపూర్వక పోటీ ఏంటి? దొంగ నా బట్టలు. టీఆర్ ఎస్ అభ్యర్థులతో టై అప్ కాకపోతే? టీడీపీ-బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడితే కంపల్సరీగా గెలిచే ప్రతిచోటా ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ వెనుక కుట్ర తెలియని కాదు. ఇక్కడ ఓటర్లు గెలిపించాలనుకున్నా.. కారును ఓడించాలనుకున్నా.. సైకిల్ కమలం పెద్దలు కుట్ర పన్ని మరీ ఆ ఓట్లను చీల్చి కారుకు దారిచ్చే ఏర్పాటు చేశారని అర్థం అవుతోంది. ఒకవేళ మొండిగా సీమాంధ్రులు ఇష్టంలేకున్నా సైకిల్ వారినో, కమలం వారినో గెలిపించినా వారు చేరేది టీఆర్ ఎస్ భవనేకన్నది సీమాంధ్రులకు తెలియనిది కాదు.
పెద్దలు వదిలి పేదల్ని మింగేస్తావా దళపతీ?
అధికారంలోకొస్తే.. వెయ్యి నాగళ్లతో దున్నుతామన్న రామోజీ ఫిల్మ్సిటీకి మరో వెయ్యి ఎకరాలిచ్చిన తెలంగాణ ప్రభువా! సీమాంధ్రులు రూపాయి బియ్యం కొని తినే కార్డులెందుకు తీసేశావ్? నకు అడ్డుగా ఉన్న కమ్మలు, రెడ్ల పని పట్టకుండా సీమాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను ఎందుకు ఓసీలుగా చేశావ్? హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బంజారాహిల్స్లో ఓటుంచావ్. అడుక్కుతినే వాళ్లు, కూలి చేసి బతికే వాళ్ల గుర్తింపుకు ఆధారమైన ఓటర్ కార్డును ఆధార్ ఆధారంతో తీసి పడేశావ్? సీమాంధ్రుల్లో పేదలే నీకు ఎందుకు శత్రువులయ్యారు కేసీఆర్ సారూ. పెద్దలు మిత్రులుగా ఎలా మారిపోయారు గులాబీ దళపతీ? నాగార్జున ఎన్ కన్వెన్షన్ రిమార్క్ ఉందని..రెడ్ మార్క్ వేయించి గులాబీ గ్యాంగ్.. అదే నాగార్జునతో ఎవరు మీలో కోటీశ్వరుడుకు సూటేసే ఆట ఆడుతారు. అయ్యప్ప సొసైటీపై ప్రొక్లయిన్ ఎక్కుపెట్టిన కారు వీరులు.. అక్కడే ఉన్న ధర్మానను వెలమ కోటాలో వదిలేస్తారు. నిలువు లోతు పాతేస్తామని వార్నింగ్ ఇచ్చి..యాగానికి ఆహ్వానిస్తారు. ఆ పత్రిక నీపై నిప్పులు చెరుగుతుంది? ఓటుకు నోటు కేసన్నావు? చంద్రబాబుకు చిప్పకూడు తినిపిస్తానన్నావు? అమరావతి ఒడ్డున బాబు ఇంటికెళ్లి రొయ్యలకూర తినొచ్చావు? ఇవేవీ తప్పుకాదు సారూ! కానీ మా పేదల్ని మింగేయకు సారూ! మేము ఓడించినా నీవు గెలుస్తావు. మేము గెలిపించిన అభ్యర్థులు మీ మనుషులై రాజ్యమేలుతారు. సారూ వేరే దేశంలో లేము. మీ ఆస్తులకు నష్టం కలిగించం. ప్రశ్నించలేని తెలంగాణ సాధన కోసం మేమెప్పుడూ అడ్డురాము. ప్రతిపక్షంలేని తెలంగాణలో సీమాంధ్ర పేదలకు ఇంత చోటివ్వండి సారూ! కారు గుర్తుపై మీరు, మీరు కేటీఆర్ సారూ! ఆ తరువాత ఆయన కుమారుడు గారు కూడా కూర్చొనేందుకు మాకెటువంటి అభ్యంతరం లేదు.
No comments:
Post a Comment