Tuesday, February 8, 2011

యాతరెల్లిపోదాం..

అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఐదేళ్ళకో, మధ్యన్తరానికో ప్రజలపై దయ, ప్రేమ కలిగి ఉండే వాళ్ళు. పరామర్సలకు నిర్దిష్ట కాలాలున్డేవి. ఇప్పుడు ఏ కాలం వచ్చినా జనాలకి మాత్రం పోయేకాలంగానే మారింది . ఇప్పుడు రోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఓ స్థాయి పరామర్సో .. ఖండనో మున్దనో చేయాల్సిన ఖర్మ నాయకులకు ఏర్పడింది. ఆంగ్ల కొత్త సంవత్సరం ఏ పార్టీ నాయకుడికి కంటి మీద కునుకు లేకుండా చేసి ఇంటి పట్టున ఉండనీయడం లేదు . పెజలంటే ఓటర్లనే స్థిరమైన అభిప్రాయం ఉన్న నేతలు నిరంతరం వారి మధ్యనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. మేడారం జాతర, పోలిపిల్లి పైడితల్లమ్మ జాతర, సంబర యాత్ర, కోటప్పకొండ తిరుణాలను జనాలు నిర్వహించుకోనేవారు. రోజులు మారాయి. సర్కారు దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షుగా మారింది. ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి. నేను పెజల మనిషినంటూ ఒకరు, నేనోస్తేనే మీకు న్యాయం అంటూ మరొకరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జనం కోసం పాటు పడేది మేమేనంటూ మొక్కు చెల్లించుకునేందుకు నాయకులే యాతరెల్లిపోదామే.. జాతరో.. జాతరో.. వూల్లమీద పడ్డారు.

No comments:

Post a Comment